పవన్ పుట్టినరోజు సందర్భంగా తునిలో భారీ అన్నసమారాధన

తుని నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తుని నియోజకవర్గంలో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ ముఖ్య అతిధిగా శుక్రవారం తునిలో భారీ అన్నసమారాధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, సంయుక్త కార్యదర్శి పలివేల లోవరాజు, కోటనందూరు మండల అధ్యక్షుడు పెదపాత్రుని శ్రీనివాస్, జనసేన నాయకులు వాడపల్లి రాము, జనసేన శివ, ఇండుగుపల్లి శ్రీనివాస్, సీతారామరాజు, బాలాజీ, దుబాసి ప్రసన్న, లక్ష్మణ్, ప్రగడ రమేష్, తర్ర దొరబాబు, మరువడ పంతులుగారు, గెడ్డమూరి సురేష్, కన్న, రాచపోతుల అశోక్, అంబటి ప్రసాద్, వంగలపూడి వంశీ, రమణ, శ్రీను తదితర జనసైనికులు పాల్గోని కార్యక్రమం విజయవతం చేశారు.