డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులు

జూబ్లీహిల్స్: మంగళవారం న్యాయవాది,భారత రాజ్యాంగం రచించిన కమిటీ కి నాయకత్వం వహించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రశాసన్ నగర్ జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో కే.శే అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గౌరవనీయులైన నేమూరి శంకర్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులైన అరహం ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నాయకులు రాజాబాబు, కొత్తపేట నాయకులు శ్రీనివాస్, మరియు రెండు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్ బి నగర్ నియోజకవర్గం నాయకులు వెంకట సాయి ప్రసాద్ కోటిపల్లి పాల్గొని అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు.