వద్దిపర్రులో రెండవరోజు జనం చెంతకు జనసేన

పాలకొల్లు నియోజకవర్గం, పోడూరు మండలం, వద్దిపర్రు గ్రామంలో జనం చెంతకు జనసేన రెండవ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో తిరుగుబాటుతనాన్ని, అలాగే వాళ్లు పడుతున్న సమస్యలను, తెలుసుకుంటూ ఈ రాష్ట్ర అవినీతి పరిపాలనని అడ్డుగట్టు వేయడానికి ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది అని మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన సిద్ధాంతాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూ జనసేన సిద్ధాంతాలను ప్రచురించిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.