“వరల్డ్ పవనిజం డే” రోజున జనసైనికుడికి అండగా అవనిగడ్డ జనసేన

అవనిగడ్డ, అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ జనసైనికుడు యన్నం లక్ష్మణరావుకి కొద్ది నెలలు క్రితం ఆక్సిడెంట్ అయి కాలుకి 3 ఆపరేషన్స్ జరిగినవి కాబట్టి తోటి జనసైనికుడికి అండగా నిలవాలని ఉద్దేశంతో విరాళాలు సేకరించి వచ్చిన 64,116/- రూపాయిలను పవన్ కళ్యాణ్ సేవాభావంతో ఏర్పడిన “వరల్డ్ పవనిజం డే” సందర్భంగా పెదప్రోలు గ్రామ జనసేన పార్టీ అధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామ్ మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు యన్నం లక్ష్మణరావుకి మరియు వారి కుటుంబ సభ్యులకు దైర్యంగా ఉండాలి అని అలాగే పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా నిలవడం జరుగుతుంది అని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్, పార్టీ సీనియర్ నాయకులు బాధర్ల లోలక్షుడు నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు యడ్లపల్లి అజయ్, మెరకనపల్లి నరేష్, భోగిరెడ్డి సాంబయ్య, మండల పార్టీ కార్యదర్శి కలపాల ప్రసాద్, మండల నాయకులు అరజా కాంత్, అవనిగడ్డ నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ సూదానీ నంద గోపాల్, మెరకనపల్లి గ్రామ అద్యక్షులు యర్రంశెట్టి సునీల్ జనసైనికులు చావకుల సురేష్, బండ్రెడ్డి మల్లికార్జున్, రాఘవ కూరేటి, రాము, రాజా తదితరులు పాల్గొన్నారు.