కొనసాగుతున్న వరద సాయం.. నాలుగు రోజుల్లో 38 వేల మందికి..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయం కొనసాగుతోంది. శుక్రవారం 9,791 మంది బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున రూ.9.79 కోట్ల నగదు జమచేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు 38,227 మందికి రూ.38.22 కోట్ల సాయం అందజేసినట్లు వివరించారు. సాయం అందని బాధిత కుటుంబాల గుర్తింపు, కొత్త దరఖాస్తుల స్వీకరణపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.