దక్షిణలో కొనసాగుతున్న కందుల పర్యటనలు

విశాఖ, 36 వ వార్డు రంగ రీజు వీధికి చెందిన పెళ్లి కుమార్తె యశోదకు బంగారు తాళిబొట్టు, పట్టు బట్టలు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏమీ ఆశించకుండా జనసేన పార్టీలో చేరానని, పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని వీలైనంత మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 36 వ వార్డు అధ్యక్షులు పడమటి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, (విజయవాడ ), గణేష్, లలిత, అప్పారావు, హేమ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.