ఘనంగా ఎచ్చెర్ల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనుకుల అవసరం మేరకు 4 మండలాలకు అందుబాటులో ఉండే విధంగా సోమవారం అంగరంగ వైభవంగా భారీ ఎత్తు జనసైనికుల సమక్షంలో జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలం, సుభద్రాపురం జంక్షన్ వద్ద జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ ఆధ్వర్యంలో.. రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ జాయింట్ కో ఆర్డినేటర్ సయ్యద్ విశ్వక్షేణ్ పర్యవేక్షణలో ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆమెచేతుల మీదుగా ప్రారంభించి, అనంతరం కార్యాలయం ఎదురుగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లేశ్వరావు. రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి బలరాం, ఎచ్చెర్ల మండలం నాయకులు మధుబాబు, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు, ప్రశాంత్ మరియు 4 మండలాల ప్రధాన నాయకులు, జనసైనికులు ,ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.