మేడ గురుదత్ ఆధ్వర్యంలో ఆరెంజ్ రీరిలీజ్ వేడుక

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ఆధ్వర్యంలో ఫ్రీగా మెగా అభిమానులు ప్రతి ఒక్కరు చూసే విధంగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ నిర్మాత మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు కొణిదెల నాగబాబు గొప్ప మనసుతో రీరిలీజ్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా షో కి అయ్యే ఖర్చు మొత్తం గురుదత్ పెట్టుకోవడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు రెండు రోజుల ముందే అభిమానుల సమక్షంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కేక్ కటింగ్ ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా గురుదత్ మాట్లాడుతూ ఆరెంజ్ సినిమా షూటింగ్ సమయంలో నాగబాబుతో నెల రోజుల పాటు ఆస్ట్రేలియాలో (షూటింగ్) పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం చిరంజీవి పిఆర్వో సురేష్ (ఎక్స్-నేవి), రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిస్ పల్లా నాగు, రాజానగరం మండలం సీనియర్ నాయకులు మన్య శ్రీను, చిరంజీవి డిజిటల్ విభాగం రాజానగరం మండల ప్రెసిడెంట్ చల్లా ప్రసాద్, రాజానగరం మండలం యూత్ ఐకాన్ పల్లా హేమంత్, వల్లేపల్లి రాజేష్, కామిరెడ్డి పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు.