సీఎం చేతుల మీదుగా ఓర్వకల్లు విమానాశ్రయ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త విమానాశ్రయం ప్రారంభం కాబోతున్నది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో కొత్త విమానాశ్రయం ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే ఈ విమానాశ్రయానికి అనుమతులు లభించడంతో పనులు వేగంగా పూర్తి చేశారు. విమానాల రాకపోకలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు రావడంతో విమానాశ్రయం ప్రారంభం కాబోతున్నది. రాయలసీమలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. కడప, రేణిగుంటల్లో విమానాశ్రయాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయంలో కలిపి మొత్తం మూడు విమానాశ్రయాలు ఉన్నాయి.