మంగానెల్లూరులో మన ఇల్లు – మన జనసేన
సూళ్లూరుపేట, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసే దిశగా సూళ్లూరుపేట మండలం, మంగానెల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ గడప గడపకు వెళ్లి స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరియు రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్, చంటి, పోలయ్య, గిరి, పెంచలయ్య, శ్రీను, సంపత్, కిరణ్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొని పవనన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-09.00.48-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-09.00.48-1024x768.jpeg)