మన ఊరు, మన వాడ, మన జనసేన
విజయనగరం, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రతీ గ్రామానికీ మరియు ప్రతీ వార్డుకూ మన పార్టీ గుర్తుతో 2 సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్బంగా గ్రామ మరియు వార్డు నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలతో సమావేశమై మరియు పరిసర ప్రాంతాలు సందర్శించి ప్రజలను పరామర్శించడం జరుగుతుంది. “మన ఊరు, మన వాడ, మన జనసేన” కార్యక్రమం విజయనగరం నియోజకవర్గానికి సంబందించిన 22 గ్రామాలు మరియు 50 కార్పొరేట్ డివిజన్ లలో జరుగనున్నది. శనివారం అయ్యాకోనేరు గట్టు దగ్గర 5 బెంచులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ప్రారంభం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-12.05.50-1024x1024.jpeg)