మన ఓటు మన గుర్తింపు.. ఓటు నమోదుపై జనసేన అవగాహన కార్యక్రమం

  • తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మన ఓటు మన గుర్తింపు నినాదంతో ఓటు నమోదుకు కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమం

కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మన ఓటు మన గుర్తింపు నినాదంతో సోమవారం కెపిహెచ్‌బి కాలనీలో ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటును నమోదు చేయించుకోవాలని కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భముగా తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మన ఆయుధమే మన ఓటు.. మన ఓటు మన గుర్తింపు.. మన ఓటు దేశ ప్రగతికి మెట్టు ఆ ఓటు ద్వారానే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని, చట్ట సభలలోకి పంపించడానికి ఓటు అత్యంత కీలకము అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో సలాడి శంకర్, సుంకర సత్య సాయి, వీరబాబు, అనిల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.