గ్రామస్థులు మరియు బాటసారులు కూర్చోవడానికి సిమెంటు బెంచిలను ఏర్పాటు చేసిన పి.గన్నవరం జనసేన

పి.గన్నవరం నియోజకవర్గం, బెల్లంపూడి గ్రామంలో కొన్ని అనువైన ప్రదేశాల్లో బాటసారులు మరియు గ్రామస్థులు కూర్చోవడానికి జనసేన పార్టీ సింగపూర్ ఎన్నారై మిత్రులు పిండి సూరిబాబు, పోతిరెడ్డి సురేష్, సత్తిబాబు, శేఖర్, సతీష్, శ్రీనివాసు, నాగరాజు సహకారంతో నాలుగు సిమెంట్‌ బెంచీలను ఏర్పాటుచేశారు మరియు బెల్లంపూడి గ్రామానికి చెందిన కీ౹౹ శే౹౹ నుదురుమాటి వెంకట సత్య ప్రసాద్ గారి జ్ఞాపకార్ధం వారి కుమారుడు హరీష్ గుప్త ఒక బెంచిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం వెంకటేశ్వరరావు, తాడాల నాగేశ్వరరావు, మాసేరావు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.