పాకాల మండలం దామలచెరువు గ్రామంలో గడప గడపకు జనసేన

చిత్తూరు, జనసేన పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు చేరేలా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్ ఆధ్వర్యంలో పాకాల మండలం దామలచెరువు గ్రామంలో ప్రజలకు అందించి జనసేన పార్టీ 2024లో అధికారంలోకి వస్తే జరిగే మేలును పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, జనసేన నాయకులు నాగూరు బాషా, చరణ్, షాజహాన్, రహంతుళ్ళ, మస్తాన్, నౌమూన్, చాంద్ బాషా, సుబ్రహ్మణ్యం, చలపతి, అహ్మద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.