పాలకొండ పట్టణంలో అంబేద్కర్ కు పాలాభిషేకం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ప్రస్తుత మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, పాలకొండ పట్టణంలో అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్బంగా పాలకొండ కాస్పా వీధిలో పాలాభిషేకం చేసిన వీరఘట్టం మండలం అంబేద్కర్ ఇండియా మిషన్ ఇంచార్జ్ వజ్రగడ రవికుమార్(జనసేన జానీ) ఈ సందర్బంగా రవికుమార్ (జానీ) మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్దాంతాలే దేశానికి శరణ్యం. అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అమర్ రహే కార్యక్రమం. శ్రీకాకుళం పట్నం కి చెందిన రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను, ఆదేశాలతో మహా పరి నిర్వాన్ దివస్ పేరుతో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు పి.వి.సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ బాబా సాహెబ్ విగ్రహాల వద్ద నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనర్ రవికుమార్ మరియు కాస్పావీది ఏఐమ్ కార్యకర్తలు పాల్గొన్నారు.