కొత్తూరు బహిరంగ సభకి హాజరైన పాలకొండ జనసైనికులు

  • జోరు వానలో తగ్గని జనసైనికుల ఉత్సాహం
  • నిబ్రం ఆధ్వర్యంలో హాజరైన పాలకొండ జనసైనికులు
  • చైతన్య అధ్యక్షతన భారీ బహిరంగ సభ
  • ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పాతపట్నం నియోజకవర్గం: కొత్తూరు మండలంలో జనసేన బహిరంగ సభ ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర వీరమహిళ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, ఆమదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు, మత్సకార విభాగం హరి బెహర, పాలకొండ నాయకులు మాజీ జడ్పీటీసీ నిమ్మల నిబ్రం పాల్గొన్నారు. జనసేన పార్టీ ఇంచార్జీ గేదెల చైతన్య ఆహ్వానం మేరకు పాలకొండ నియోజకవర్గం నాయకులు, గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ నిమ్మల నిబ్రం, జనసైనికులు హాజరైనారు. ఈ సభ ప్రారంభంలో గంటన్నర పైగా వర్షం కురిసినా, కానీ ఎక్కడా తగ్గిన జనసైనికుల ఉత్సాహం. వివిధ నియోజకవర్గాల నుంచి జనసైనికులు చేరుకున్నారు . పాలకొండ నాయకులు నిమ్మల నిబ్రం మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్తానం యువకులు సహకారంతో ప్రారంభం అయింది అని, సర్పంచ్ మరియు జడ్పీటీసీ ఎల్లక్షన్ సమయంలో గెలుపుకి కారణం యువత అని చెప్పారు. ఈ జోరు వానలో మీ జోరు చూస్తుంటే నా రాజకీయ రోజులు గుర్తుకొస్తున్నాయి. జనసేన పార్టీ బలం యువత, ఆ యువత స్పూర్తి తోనే జనసేన పార్టీలో చేరారని కొనియాడారు. జనసేన పార్టీ ఉదయించే సూర్యుడు లాంటింది అని, తెలుగు దేశం పార్టీ అస్తమిస్తున్న సూర్యుడు లాంటిది, వైస్సార్ పార్టీ నిండా మునిగిన టైటానిక్ లాంటిది అని, ఈ మూడింటిలో ఏ పార్టీ వైపు నిలబడితే భవిష్యత్ బాగుంటుందో యువత ఆలోచించాలని తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గం చైతన్యం పొందాలి అంటే మన చైతన్య గెలిపించాలని, గాజు గ్లాసుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.