గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా పాలకొండ జనసేన నివాళి
పాలకొండ: మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి కి ఘన నీవాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలూగెత్తి చాటిన ఆధునికాంధ్ర కవితా పితామహుడుకి జనసేన పార్టీ తరపున జనసేన జానీ ఘననివాళులు అర్పిస్తున్నాం. మత్స పుండరీకం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఇలాంటి మహనీయులకి గుర్తింపే లేకుండా ఐపోయింది. ప్రతి పధకానికి ఒక్క మహనీయుని పేరు పెట్టకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అన్నారు. కర్రి కళ్యాణి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ప్రతి పధకానికి దేశం కోసం ఆంధ్రప్రదేశ్ కోసం మరణించినటువంటి మహనీయులు పేరులు మాత్రమే పెడతారు అని అలాంటి నాయకుడుని సీఎం చేయవలిసిందిగా ప్రజలని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నెన సాయి పవన్, వావిలిపల్లి బుషన్, బొమ్మాళి వినోద్, దూసి ప్రణీత్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-30-at-16.25.38-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-30-at-16.25.38.jpeg)