‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పలమనేరు జనసేన

పలమనేరు, సోమవారం పలమనేరు రూరల్ మండలం బయ్యప్ప గారి పల్లి పంచాయితీ నాయకులు మరియు కార్యకర్తలతో మండలాధ్యక్షులు నాగరాజు మోతుకూరు కలసి రాబోయే రోజుల్లో మండల పరిధిలో ఉన్న ప్రతి ఊర్లో పార్టీ సిద్ధాంతలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకుని వెళ్లాలని చర్చించడం జరిగింది అలాగే పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ వినూత్నంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ అనే కార్యక్రమంలో ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తమ మద్దతుని ఆర్ధిక మద్దతుగా చూడకుండా సంఖ్యా బలం చూపించడం కోసమే అందుకు నిదర్శనమే రూ.10 నుండి మీ స్థోమత కొద్ది కాంట్రిబ్యూషయిన్ చేసి జనసేన పార్టీకి మద్దతుగా ఉండాలని కోరారు. మరియు అక్టోబర్ 5 నుండి అధ్యక్షులు వారు ప్రారంభించనున్న బస్సు యాత్ర సందర్బంగా మన పంచాయితీ పరిధిలో ఉన్న సమస్యలను ఒక మెమోరాండంగా ఇస్తే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయనకు తెలియచేసి సమస్యలు పరిష్కరానికి కృషిచేస్తానన్నారు. అలాగే అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్బంగా మండల పరిధిలో పలు పంచాయతీల్లో జనసేన జెండాను ఆవిష్కరించేలా నిర్ణయించుకున్నామన్నారు. నియోజకవర్గంలో రూరల్ మండలం చాలా బలంగా ఉండాలని ఉండేలా ప్రకతిఒక్కరు కృషి చేయాలనీ ఈ సందర్బంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వినోద్ రాయల్, జనరల్ సెక్రటరీలు మాధవ శివ, గిరి, ఉమాపతి, చంద్రశేఖర్, కోదండ, వేణు, దాము, రాజు, జ్యోతి, హేమంత్, మహేష్, వాసు, తిరుమలేష్, హరీష్, పరందమా, నరేష్, లక్ష్మయ్య, రాజేంద్ర, వెంకటేష్, సోమురాజు, శ్రీనివాసులు, ధనపాల్ తదితరులు పాల్గొన్నారు.