పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా పలమనేరు జనసేన

పలమనేరు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మూడు రోజులుగా నిరసన తెలియజేస్తున్న పారిశుద్ధ్య కార్మికులుకు మద్దతుగా పలమనేరు నియోజకవర్గం లో జనసేన పార్టీ చిత్తూర్ జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్, పూల చైతన్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియా ముఖంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- వై ఎస్ ఆర్సీపీ ప్రభుత్వం తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరపున కార్మికులకు పూర్తి మద్దతుని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల ఇంఛార్జి మరియు కార్యవర్గ సభ్యులు, నగర కమిటీ సభ్యుల మరియు జనసైనికులు పాల్గొన్నారు.