వైసీపీలోని పాలేరు కాపు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కాపులకు రాజ్యాధికారం రానివ్వరా?

ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో పాలేరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ముఖ్యంగా వైసీపీ బానిస పాలేరు కాపులైన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కాపు జాతిని మోసం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా వేరే ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి కాపులను వాడుకుంటున్నారని నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి వైసీపీ పాలేరు కాపులకు సూటిగా ప్రశ్నించారు.

* కాపులను బి సి ల్లో చేర్చాలని జగన్ రెడ్డి ని ఎందుకు డిమాండ్ చేయడంలేదు?

* కాపులకు 5 % రిజర్వేషన్స్ కోసం ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడంలేదు ?

* ప్రతీ సంవత్సరం కాపు కార్పొరేషన్ కు 2000 కోట్లు ఇస్తానని వాగ్దానం చేసి ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వని ముఖ్యమంత్రిని అడిగే దమ్ములేదా?

* కాపు నేస్తం అర్హులైన కాపులందరికి ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎప్పుడైనా అడిగారా?

*కేంద్ర ప్రభుత్వం మోడీ అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించిన వాటిలో గత ప్రభుత్వం కాపులకు 5% ఈబీసీ కోటా కింద రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు ఆమోదం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లును రద్దు చేయడాన్ని ఈ పాలేరు కాపులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు మీకు కాపు జాతి, కాపు జాతిలోని నిరుద్యోగ యువత గుర్తుకు రాలేదని ప్రశ్నించారు?

* కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కులాలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల రుణాలను కార్పొరేషన్ కింద చూపి కాపులు మోసం చేయడం కాదా అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుని ప్రశ్నించారు.

* కాపు జాతిని ఇలా అన్ని విధాలుగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి వైసీపీలోని పాలేరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కాపులే కాకుండా అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన వైసిపి కి ఓట్లు అడిగే అర్హత కోల్పోయారని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషిస్తున్న పాలేరు కాపు ప్రజాప్రతినిధులకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేసే బాధ్యతను కాపు యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

* వైఎస్ఆర్సిపి లో 26 మంది పాలేరు కాపు ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 5 మంది శాసనమండలి సభ్యులు ఉండి కూడా కాపులను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే దమ్ము లేక, మంత్రి పదవుల కోసం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడుతూ బానిస బతుకు బతుకుతున్న మీరు కాపు జాతి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని వైసీపీలో ఉన్న పాలేరు కాపులు జగన్మోహన్ రెడ్డి కి ఊడిగం చేస్తూ బానిస బతుకు బతకండి తప్ప కాపు జాతిని అంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద పెడతామంటే కాపు జాతి మిమ్మలను సహించదని హెచ్చరించారు.

*పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించింది ఎవరి పల్లకి మోయడానికి కాదని బడుగు బలహీన వర్గాలను పల్లకి ఎక్కించడానికి వారిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికనీ, పవన్ కళ్యాణ్ వెంట కాపులే కాకుండా ఎస్టి, ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరులు అండగా ఉన్నారని తెలియజేశారు.

* 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన జెండా ఎగర పోతుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, బావికాడి గుర్రప్ప, ఆంజనేయులు, చైతన్య, నాగేంద్ర, వెంకటరామయ్య పాల్గొన్నారు.