పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 12వ రోజు
నాగర్ కర్నూల్ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ జనసేన నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెలకపల్లి మండలం, జమిస్తపుర్ మరియు చిన్నముద్ధునురు గ్రామాలలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 12వ రోజు నిర్వహించడం జరిగింది. జమిస్తపుర్ మరియు చిన్నముద్ధునురు గ్రామాలలో వంగ లక్ష్మణ్ గౌడ్ గడప గడపకు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న, దేశమొని రాజేష్, గోపాస్ రమేష్, రాకేష్ రెడ్డి, కొడిగంటి సాయి కుమార్, వంశీ, లక్ష్మి నారాయణ, సూర్య, లింగం నాయక్, రాజు నాయక్ మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-15.09.00-576x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.36.29-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.36.22-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.36.18-1024x576.jpeg)