పితాని ఆధ్వర్యంలో పంచాయితీ వార్డ్ కన్వీనర్స్ సమావేశం

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నగర పంచాయతీ 20 వార్డుల కన్వీనర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వార్డులలో పార్టీ బలోపేతం గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి, వార్డు కమిటీ సభ్యులను వేగవంతం చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, ముమ్మిడివరం నగరపంచాయితీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు (కొండ), రంబాల రమేష్, యలమంచలి బాలరాజు, సానబోయిన వీరభద్రరావు, పితాని రాజు, చిట్టూరి దొరబాబు, నగరపంచాయితీ వార్డ్ కన్వీనర్స్ పాల్గొన్నారు.