పలువురిని పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, కరప మండలం గొడ్డెటి పాలెం గ్రామానికి చెందిన చోడబత్తుల మణికంఠ కాకినాడ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఎపండిసైటీస్ ఆపరేషన్ చేయించుకున్న వారిని బుధవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆసుపత్రిలో పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. అనంతరం కరప మండలం, గురజనపల్లి వాస్తవ్యులు జనసేన పార్టీ మండల నాయకులు సుందర సత్తిబాబు తండ్రి అకాల మరణ వార్త విని గురజనపల్లికి చేరుకొని సత్తిబాబుని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరిగింది.