వేళంగి గ్రామంలో జనసేన-టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రచారం

కరప మండలం, వేళంగి గ్రామం, ధళమ్మ చెరువు గట్టు, చిరంజీవి కోలని, గున్నం దిబ్బ ప్రాంతాలలో స్థానిక జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసు దాసు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్ర మైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుఫై వేసి అఖండ మెజారిటి తో గెలిపించాలని కోరుతూ.. అదేవిధంగా గ్రామంలోని ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నానాజీ మాట్లాడుతూ రాబోయే ఎన్.డి.ఏ ప్రభుత్వం హయాంలో మౌలిక వసతులు కల్పిస్తామని, మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కూడా చేసి చూపిస్తుంది అని, స్థానికులకు ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితి, ఎన్నికైన తరువాత ఈ ప్రాంతానికి ఏనాడూ రాలేదని, స్థానికంగా నేరెళ్లమ్మ గుడి నిర్మాణం, బీసీ కల్యాణ మండపం నిర్మిస్తానని హామీ ఇచ్చి ప్రజలని మోసం చేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, నాయకులు బీజేపీ, జనసేన రాష్ట్ర, మండల, గ్రామ స్థాయి నాయకులు, స్థానిక జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *