తదేకం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నూతన బోటుని ప్రారంభించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రేపూరు గ్రామంలో ఏటి గట్టున కొవ్వూరు, రేపూరు గ్రామాల రైతులకు, రైతుకులీలకు వ్యవసాయ అవసరాలకు సరైన సదుపాయాలు లేక అనేక అవస్థలు పడుతున్న వారికి రేపూరు గ్రామ పర్యటనకు వచ్చిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి స్థానిక జనసేన నాయకులు సమస్య తెలియచేసారు. ఈ విషయంఫై తదేకం ఫౌండేషన్ వారి ప్రతినిధులకు తెలిపిన వెంటనే లక్ష నలభైఐదు వేల రూపాయల ఖర్చు చేసి నూతన బోటుని ఏర్పాటు చేయడం, దానిని తదేకం ఫౌండేషన్ వారి ప్రతినిధుల సమక్షంలో స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో గురువారం పంతం నానాజీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.