జగనన్న కాలనీలను సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని జగనన్న ఇళ్ల స్థలాల పరిశీలనలో భాగంగా తిమ్మాపురం, పండూరు, నేమం ప్రాంతాలలో గల జగనన్న ఇళ్ళ స్థలాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.