తూరంగి మహాలక్ష్మి నగర్ లో పర్యటించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, తూరంగి మహాలక్ష్మి నగర్ లో పర్యటించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి స్థానిక మహిళలు ఆ ప్రాంతంలో డ్రైనేజీ లు సరిగా లేవని, పారిశుద్యం నిర్వహణ చాలా దారుణంగా ఉందని పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని. త్రాగునిటీ సమస్య ఉందని, పందుల బెడద ఎక్కువగా ఉందని తెలిపారు… త్వరలో అధికారులకు ఈ సమస్యలపై వినతిపత్రం ఇద్దామని లేని పక్షం లో నిరసన తెలిపుదామని మరియు ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా మీ సమస్యలకి కొంత సమయం తీసుకుని పరిష్కారము చూపిస్తామని తెలిపారు.