జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కొవ్వూరు, తూరంగి, ఉప్పలంక, గురజనపల్లి, గొర్రిపూడి, కూరాడ, పేపకాయలపాలెం గ్రామాల్లోని ఇటీవల ప్రమాదాల్లో గాయపడిన, మరియు అనారోగ్య కారణాలవల్ల చనిపోయిన జనసైనికుల కుటుంబాలను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సోమవారం పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీనివాస్, రెడ్డిపల్లి కిషోర్, తిబిరిశెట్టి ప్రసాద్, బుజ్జి, సింగిరెడ్డి సత్తిబాబు, బోగిరెడ్డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.