పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, పెద్దాపురప్పాడు జనసేన పార్టీ ఎంపీటీసీ భర్త పబ్బినీడీ ప్రసాద్ మరియు ఇద్దరు జనసైనికులు అనారోగ్య కారణాలవల్ల, మరియు ప్రమాదంలో గాయపడిన వారిని మంగళవారం పరామర్శించిన జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. ఈ సందర్బంగా పెద్దాపురప్పాడులో పర్యటించిన నానాజీ కి స్థానిక మహిళ (దివ్యంగురాలు) నాకు అర్హత ఉన్నా కాపు నేస్తం రాలేదని తెలిపారు.. నానాజీ వెంటనే ఎండిఓ తో మాట్లాడి విషయం తెలియచేయగా 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండలనాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.