పేర్ని నానీ నోరుజాగ్రత్త.. తుమ్మి లక్ష్మీ రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్

  • నోరు అదుపులో, మాట పొదుపులో ఉంటే మంచిది
  • పోయిన మంత్రి పదవులు మరలా పదవులు ఎలా తెచ్చుకోవాలా అనే తర్చన బర్జనలో వైసీపీ ఎమెల్యేలు

విజయనగరం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై పేర్ని నానీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కొ ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ శుక్రవారం మీడియా ముఖంగా మాట్లాడుతూ.. మంద ఎక్కువై మంత్రి పదవులు పోయి మరలా పదవులు ఎలా తెచ్చుకోవలో అనే తర్చన బర్జనలో ఉన్న వైసీపీ ఎమెల్యేలకు పవన్ కళ్యాణ్ గారు ఆశాదీపంలా కనిపిస్తున్నరెమో ఆయన మీటింగ్ అవ్వగానే వీళ్ళ ప్రసంగాలే ఎక్కువైపోతున్నాయి.. పవన్ కళ్యాణ్ గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు నోరు అదుపులో, మాట పొదుపులో ఉంటే మంచిది లేకపోతే మా వీరమహిళలతోనే చెప్పు దెబ్బలు, చీపురుకట్ట దెబ్బలు తినే రోజులు ఉన్నాయ్ మీకు…పదవి కావాలంటే అసెంబ్లిలో ప్రజ సమస్యలపై మాట్లాడండి ..అంతే గాని తగుదునమ్మా అని మా అధినేత జోలికి వస్తే ఖబద్దార్ ఒక్కొక్కడికి.. అని లక్ష్మీ రాజ్ విరుచుకు పడ్డారు.