మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన పార్వతీపురం జనసేన

పార్వతీపురం, వృక్షో రక్షతి రక్షితః జనసేన పార్టీ సిద్ధాంతాలలోని ఒక అంశం అయిన పర్యావరణ పరిరక్షణ కోసం పార్వతీపురం పట్టణంలో యువత ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అగ్రహారం, పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా, వాతావరణ మార్పులు సకాలంలో వర్షాలు లేకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వలన కరువు కాటకాలకు ముఖ్యకారణం అని మనం మన వంతు ప్రకృతి కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మెక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు గోర్లి చంటి, వంశీ, బాలు, సతీష్, కమాల్, పవన్, అంజి, శంఖు, కృష్ణ, పోరాని తదితరులు పాల్గొన్నారు.