మహాశివరాత్రి వేడుకలలో పాల్గొన్న పార్వతీ నాయుడు

వేమూరు: మహాశివరాత్రి సందర్భంగా జనసేన మహిళా వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతీ నాయుడు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మండూరు గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిలకలూరిపేట నియోజకవర్గంలో కోటప్పకొండ వెళ్లు భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు నారాకోడూరు, శుద్ధపల్లి, కట్టెంపుడి, తాళ్లపాలెం, గొడవర్రు, గ్రామాలలో ప్రభలను దర్శించి, తిరణాల కార్యక్రమాలలో పార్వతీ నాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం గురించి ప్రజలకు వివరించి, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.