నారి శక్తి వందన్ బిల్లు ఆమోదం శుభపరిణామం: గాదె
గుంటూరు: నారి శక్తి వందన్ బిల్లు ఆమోదం పొందడం ద్వారా చట్టసభలలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభించే గొప్ప అవకాశం లభిస్తున్నది. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర రాజకీయ వ్యవస్థలో ఇది ఒక గొప్ప పరిణామం అని గుంటూరు జిల్లా జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో రాజకీయంగా మహిళలు స్వతంత్రంగా ఎదుగుతూ భారత దేశంలో సామాజిక సమతుల్యత, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పి బలంగా భావిస్తున్నాము. జనసేన పార్టీ గుంటూరు జిల్లా తరఫున మహిళా మణులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామని గాదె పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-06-10-at-3.56.49-PM-800x445-1.jpeg)