శ్రీమతి మాకినీడి శేషుకుమారికి పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆహ్వానం

పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఫ్యామిలీ క్రిస్మస్ 6-12-2021న జరిగే వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గోవాలని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి యు.కొత్తపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీ జోసఫ్ తొంమండ్ర మరియు సెక్రటరి శ్రీ అలెక్స్ డి మాథ్యూస్ ఆహ్వానించి ఇన్విటేషన్ లెటర్ అందజేశారు. ఫెలోషిప్ పాస్టర్లు, మాథ్యూస్, ఎమ్. కరుణా ప్రసాద్, పి లాజరు, ఎమ్. కుమార్, డి. డేవిడ్, జనసైనికులు మెరుగు ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.