అధికారులను ప్రశ్నించిన పాటంశెట్టి సూర్యచంద్ర

జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కంపెనీ వారికి అచ్యుతాపురం గ్రామంలో నుండి ప్రభుత్వ అధికారులు పోలీసుల సహాయంతో దౌర్జన్యంగా 33కెవి ఎలక్ట్రికల్ స్తంభాలు వేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ఊరి జనం అంతా ఆందోళన పడుతూ, వ్యతిరేకిస్తూ ఉండగా వారిని గోకవరం పోలీసు వారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయం పై 220కెవి సబ్ స్టేషన్ అధికారులతోను, కోరుకొండ ఎలక్ట్రికల్ ఏడిఈ తోను, గోకవరం ఎస్సై తోను మాట్లాడడమే కాకుండా 220కెవి సబ్ స్టేషన్ నుండి ఐఓసిఎల్ కంపెనీకి ఒక కిలో మీటరు కంటే తక్కువ దూరం ఉన్న దారిని వదిలేసి 3 కిలో మీటర్లు చుట్టూ తిరుగుతూ అచ్యుతాపురం గ్రామం మధ్యలో నుండి వెళ్ళే విధంగా తప్పుడు ఎస్టిమేషన్ వేసి ఇచ్చిన అధికారులు ఎవరు అని ప్రశ్నించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర.