చొల్లంగి గ్రామ ప్రజల రిలే నిరాహారదీక్షకు పితాని మద్దతు

ముమ్మిడివరం, తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబందించిన సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాల కోసం కాకినాడ రూరల్ వారికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చొల్లంగి గ్రామ ప్రజలు తలపెట్టిన రిలే నిరాహారదీక్ష 21 వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియొకసారి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), అత్తిలి బాబురావు, కనకాల పెదబాబు, వెలుగుబంట్ల సూరిబాబు, కొప్పిశెట్టి గణేష్, పితాని రాజు, టేకుమూడి త్రిమూర్తులు, గ్రామ పెద్దలు మొదలగువారు పాల్గొన్నారు.