ఉగ్రదాడిపై పత్తికొండ జనసేన తీవ్ర నిరసన

జమ్మూ & కాశ్మీర్ పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన దుర్మార్గమైన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పత్తికొండ టౌన్‌లో మానవహారం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు నాలుగు స్తంభాల కూడలి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, “పహల్గాం దాడిలో అమాయక పౌరులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించాయి. బాధితుల పరిస్థితిని చూస్తే మనసు కలచి వేస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి, రామనాయుడు మాట్లాడుతూ, “పర్యాటకులపై మతాన్ని అడిగి కాల్చడం అత్యంత హేయమైన చర్య. దేశాన్ని చీల్చే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. దేశ ప్రజలంతా గళం విప్పే సమయం ఇది” అన్నారు. కార్యక్రమాల కమిటీ సభ్యుడు క్రాంతి కుమార్ మాట్లాడుతూ, “కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ఈ దాడులు జరుగుతున్నాయి. దేశ భద్రత, సమగ్రత కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి” అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నేతలు వడ్డే వీరేష్, ఇస్మాయిల్, నాగార్జున, సుధాకర్, మనోహర్, మహేష్, మురారి, రాజు, అంజి, జయరాముడు, రామకృష్ణ, ఖాజా, టిడిపి నాయకులు కడవల సుధాకర్, వీటి గోవిందు, ముని నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment