ఇఫ్తార్ విందులో పాల్గొన్న పత్సమట్ల భీమరాజు

ఉంగుటూరు, రంజాన్ మాసం సందర్బంగా శనివారం భీమడోలు మండలం అంబర్ పేట గ్రామంలో నూర్ బాషా సంఘం వారు (ముస్లిం సోదరులు) ఏర్పాటు చేసిన “ఆత్మీయ ఇఫ్తార్ విందుకు” ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సోదరులు పత్సమట్ల భీమరాజు & గన్ని గోపాలం హాజరయ్యారు. ఈ సందర్బంగా భీమరాజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన,టీడీపీ, బీజేపీ నాయకులు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ జనసైనికులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment