పవనన్న ప్రజాబాట 74 వ రోజు

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, చిన్న పిసిని గ్రామంలో జనసేన పార్టీ పవనన్న ప్రజాబాట 74 వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు మరియు మాజీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ సీనియర్ రాజకీయ నాయకులు కరి మజ్జి మల్లేశ్వర రావు ఉపాధి కూలీలను, రైతాంగాన్ని, కార్మికులను, విద్యార్థులను, మహిళలను మరియు అన్ని వర్గాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను,ఎన్నికల మేనిఫెస్టోను గూర్చి వారికి తెలియజేశారు. స్వాతంత్రానంతరం అనేక ప్రభుత్వాల పనితీరును మనందరం చూసామని.. అయినప్పటికీ ఇప్పటికీ అనేకమందికి ప్రగతి ఫలాలు అందడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ రోజుల్లో కూడా ఉండడానికి ఇల్లు.. కట్టుకోవడానికి బట్ట.. తినడానికి తిండి లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధి లేక వలసలు పోతున్నారని.. విద్యావంతులకు ఉద్యోగావకాశాలు కొరత ఏర్పడుతుందని. అనేక ఏళ్లుగా భ్రష్ట రాజకీయాలతో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయి అనేక కుటుంబాల జీవన స్థితిగతుల మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని బాధను ప్రజలకు తెలియజేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి నాయకత్వం, నాయకుడు కావాలని కోరుకున్న ప్రజలకు మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, మదర్ తెరిసా, డాక్టర్ అంబేద్కర్, వివేకానందుడు అనేక మహనీయుల స్ఫూర్తి కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మల్లేశ్వర రావు తెలిపారు. కాబట్టి అటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి సమర్థ నాయకులు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మనందరం వ్యక్తి వ్యక్తిని గుండె గుండెను తట్టిలేపి రాబోయే ఎన్నికల నాటికి వాడవాడలా.. పల్లె పల్లె లో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి.. ముఖ్యమంత్రిగా గెలిపించ వలసిందిగా పేరుపేరునా మీ అందరూ గాజు గ్లాస్ గుర్తు పెట్టుకొని అఖండ విజయాన్ని చేకూర్చాలని మల్లేశ్వర రావు తెలియజేసారు.