విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు విజయవాడకు విచ్చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.