పోలవరం గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం
కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం పోలవరం గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన నాయకులు పోలవరం గ్రామ అధ్యక్షులు దెయ్యాల హరిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, ఈ గ్రామంలో పంతం నానాజీకి స్థానిక ప్రజలు వారి సమస్యలను విన్నవించారు. మంచినీరు పైపు లైను పంటకలవలో నుండి రావడంతో కలుషితం అయిన నీరు వస్తోందని ఎమ్మెల్యేకి, సర్పంచ్ కి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన వాళ్ళ పేరులు జనసేన జండా పట్టుకున్నారని పట్టాలు నిలిపివేశారు అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు ఏ పని చేయలేదు స్మశానంలో ఎటువంటి సౌకర్యాలు లేవని, ఎన్నికల సమయంలో తప్ప ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి రాలేదు అని, వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని చెప్పి నిర్మాణం చేయలేదు అని ఇలా అనేక సమస్యలు తెలిపారు. త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పోలవరం యువత మరియు టీడీపీ నాయకులు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-20.43.21-1024x462.jpeg)