సిరిపురం గ్రామంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, సిరిపురం గ్రామంలో గ్రామ అధ్యక్షులు నున్న మాధవ్ మరియు నున్న గణేష్ నాయుడు ఆధ్వర్యంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న నానాజీకి ఈ గ్రామంలోని ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజలు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కులాయి కలెక్షన్ లేదు కావున కలెక్షన్ ఇవ్వడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది కానీ పనులు మొదలుపెట్టలేదు అని తెలిపారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ లేదు రోడ్లపై చెత్త వేస్తున్నారు కావున ప్రజలకు ఇబ్బందిగా ఉందని తెలిపారు కావున డంపింగ్ యార్డ్ అవసరం ఉందని తెలిపారు. సిరిపురం గ్రామం నందు యుపిఎస్ స్కూల్లో 55 మంది పిల్లలు ఉన్నారు కానీ పాఠశాల కు వంటశాల లేదని పాఠశాలకు గ్రౌండ్ లేదని తెలిపారు. గ్రామంలో కొత్త విద్యుత్ స్తంభాల అవసరం ఉన్నాయి బీసీ స్మశాన వాటిక వరకు 10 ఎస్సీ స్మశాన వాటిక వరకు 10 విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్నాయి స్మశానకు వాటిక వద్ద నీటి సౌకర్యం లేదు చుట్టూ ప్రహరీ గోడ స్థానపు గదులు వసతులు కల్పించాలని తెలిపారు. గ్రామం నందు కరెంటు వైర్లు క్రిందకు వేలాడుతున్నాయి. గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జరగవలసి ఉందికావున శిశు రోడ్ల నిర్మాణం జరగవలసి ఉంది. సిరిపురం గ్రామంలో హై స్కూల్ లేదు వేరే గ్రామానికి వెళ్లి విద్యాభ్యాసం చేయవలసి వస్తుంది. గ్రామంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. గ్రామం నందు గ్రంథాలయం ఉండేది కానీ దాని మెయింటినెన్స్ సరిగా లేకపోవడం వల్ల మూసి వేయడం జరిగింది కానీ గ్రంథాలయ టాక్స్ వసూలుసిరిపురం నుండి బురిలి దిబ్బ వరకు స్కూల్ నుండి స్మశాన వాటిక కాలువ వరకు సిరిపురం నుండి దుర్గంధశెట్టి వరకు కాలువ రోడ్డు నుండి నున్న శంకరయ్య పొలం వరకు వెళ్లే రోడ్లు మరమ్మత్తులు చేయాలి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.