పి.వెంకటాపురంలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: రూరల్ మండలం, పి. వెంకటాపురం గ్రామంలో గ్రామ అధ్యక్షులు, పిల్లి శివ ఆధ్వర్యంలో రామాలయవిధి, కాలని ప్రాంతాల్లో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, మరియు టీడీపీ నాయకులు. ఈ గ్రామంలో పర్యటన చేస్తున్న పంతంనానాజీకి ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామంలో మంచి నీటి సమస్య ఉందని, ఇంటింటికి కుళాయిలు లేవని, కలుషితమైన మంచి నీరు వస్తోందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అభివృద్ధి లేకుండా పోయింది అని, యువతకి ఉద్యోగాలు లేవని, అర్హులకు పెన్షన్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, వైసీపీ కి ఓటు వేయలేదని పథకాలు నిలిపి వేశారని, తెలిపారు. వీటన్నిటిని అధికారుల దృష్టికి తీసుకువెళదామని, సరైన చర్యలు చేపట్టక పోతే, త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.