సుండుపల్లిలో దిగ్విజయంగా కొనసాగుతున్న పవన్ అన్న ప్రజా బాట

  • పవన్ అన్న ప్రజా బాట 141వ రోజు

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలంలోని జి రెడ్డివారి పల్లి పంచాయతీలో 141వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీరమహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, చంగల్ రాయుడు, కిషోర్, జనసేన వీరమహిళలు, సుగుణమ్మ, లక్ష్మమ్మ, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.