పవన్ సీఎం అయితే నైతిక విలువలతో కూడిన పాలన

-రాజంపేట జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య

రాజంపేట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే నైతిక విలువలతో కూడిన పాలన ఉంటుందని రాజంపేట జనసేన పార్టీ జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 57వ రోజు గురువారం రాజంపేట మండలం కూచివారిపల్లె పంచాయతీలోని పలు గ్రామాలలో జనసేన నాయకులు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే నైతిక విలువలతో కూడిన పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి శ్రీనివాసులు. జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి, జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.