మునిపెడ దళితవాడలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

  • దళితులు భారీగా జనసేనలో చేరిక

పెడన నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా కృత్తివెన్ను మండలం, మునిపెడ దళితవాడలో పెడన నియోజకవర్గంలోని మొదటి బర్త్డే కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి కూనసాని నాగబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళితులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలపై గౌరవంతోపవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పై నమ్మకంతో పార్టీలో చేరామని దళిత యువకులు తెలియజేశారు. జనసేన పార్టీలో చేరిన వారిలో పాము, సుగుణ రావు, వాసు, పెళ్లి బాలస్వామి, కాంట్రాజోజి, కర్ర నవీన్, కటారి కోటయ్య, కాకా జీవన్ ఉన్నారు. వేడుకలలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి జనసేన పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు దళిత యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, ఒడిమి జయరాజ్, కూనసాని నాగబాబు, పాశం నాగమల్లేశ్వరరావు, పుప్పాల సూర్యనారాయణ, పిన్నింటి రామయ్య, బడితి నాగబాబు, ముదినేని రామకృష్ణ, శీలం ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.