అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని, పోలీసుల్ని అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ ని ఆపలేరు

  • రోడ్డులో ఉన్న గుంతలు పూడ్చడానికి దిక్కు లేదు, కానీ పేదల ఇల్లు కూల్చడానికి మాత్రం ఈ వైసిపి ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది
  • మాకు మా ప్రాణాలు కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం
  • బంగారం, డబ్బులు, దాచుకున్నట్లు ఇల్లు కూడా దాచుకోవడానికి అతిపెద్ద బ్యాంకు ఉంటే బాగుంటుంది
  • మీరు పెట్టే అక్రమ కేసులకి మా జనసైనికులు భయపడరు
  • విప్పటం గ్రామ ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది
  • పవన్ కళ్యాణ్ కి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలి
  • వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డ మనోజ్ కుమార్

కొండేపి, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా “ఇప్పటం” గ్రామ ప్రజలు తమ పొలాలు ఇచ్చి సభ నిర్వహించుకోమని జనసేన పార్టీకి అండగా ఉన్నారు, రాష్ట్రంలో జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరాభిమానాన్ని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక, జీర్ణించుకోలేక, భరించలేక, రాబోయే ఎన్నికలో ఓడిపోతామని భయం ఈ వైసీపీ నాయకుల్లో ఏర్పడి, రోడ్డు విస్తీర్ణం పేరుతో ఇప్పటం గ్రామ ప్రజల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. రోడ్డుకి అడ్డంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం ఏమి చేయలేదు. అమాయకులైన పేదలైన ప్రజల ఇల్లు మాత్రం అన్యాయంగా ఈ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇంటికి రక్షణ లేదు, మనం బంగారాన్ని మరియు డబ్బులను తీసుకెళ్లి దాచుకోవడానికి బ్యాంకులు ఉన్నట్లుగా, మనం కట్టుకున్న ఇంటిని కూడా తీసుకెళ్లి బ్యాంకులో దాచుకునేటట్టు అతి పెద్ద బ్యాంకు ఉంటే కానీ మన ఇంటికి రక్షణ ఉండదు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈ వైసీపీ ప్రభుత్వంలో దేశనాయకుల విగ్రహాలు మరియు దేవతల దేవుళ్ళ విగ్రహాలు కూల్చివేస్తారు. కానీ వైయస్సార్ విగ్రహాన్ని మాత్రం ఏమి చేయరు, కంచెలతో మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో పకడ్బందీగా సెక్యూరిటీ నిర్వహించారు, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈరోజు ఇప్పటం గ్రామ ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా ఉంది అటువంటి రోడ్లను పట్టించుకోకుండా ఒక చిన్న గ్రామమైన మారుమూల గ్రామమైన ఇప్పటం గ్రామాన్ని రోడ్డు విస్తరణ పేరుతోటి ఇల్లు కూల్చడం చాలా దుర్మార్గమైన చర్య, మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు మా మీద అక్రమంగా కేసులు పెట్టిన మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటం గ్రామ ప్రజలకు మాత్రం జనసేన పార్టీ అండగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ ప్రతి పేదవాడికి ప్రతి సామాన్య మానవుడికి అండగా ఉంటుంది అని ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.