పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ జనగామ జిల్లా

జనగామ పట్టణంలో జనగామ సీనియర్ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బాషా ఇంట్లో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో స్థానిక రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు జోగు భాస్కర్ మాట్లాడుతూ మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో అలమటించే నిలువ నీడ లేని వారికి ఆకలి తీర్చేందుకు ఆహారాన్ని అందించిన సీనియర్ రిపోర్టర్ భాషా కి ధన్యవాదములు. ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తితో వారి వారి యువత గ్రామాలలో పట్టణాలలో ఆకలితో అలమటించే వారికి ఆకలి తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రె శేఖర్, సాయి, డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్, మను, సేవెళ్లి కార్తీక్, దిలీప్, రంజిత్, నామాల సిద్దు గౌడ్, నాని, నరేంద్ర, పవన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.