పేద ప్రజల అభ్యున్నతికి అనునిత్యం ఆలోచన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్: బత్తుల
- జనసేన పార్టీకి రోజురోజుకూ రైతులు, మహిళల నుంచి పెద్దఎత్తున పెరుగుతున్న ఆదరణ
- “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”లో అల్లాడి సింహాచలంకు 5000/- ఆర్థిక సహాయం
- “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 55వ రోజు
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో జరిగిన. “జనం కోసం జనసేన” “మహా పాదయాత్ర” గ్రామంలో ఉదృతంగా పర్యటించారు “నా సేవ కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా గ్రామస్తులతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ పేదప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి అనునిత్యం శ్రమిస్తున్న నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. అల్లాడి సింహాచలం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం పాదయాత్ర జనసైనికులు, మహిళలు సహకారంతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.27.53-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.27.50-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-08-at-19.27.53-1-1024x576.jpeg)