రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

  • పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే
  • సామాన్య ప్రజలకు మన రాష్ట్రంలో రక్షణ లేదు
  • మనం అందరం ఒక్కటి అయ్యి ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలో జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తానికి తెలుసు, వైసిపి ప్రభుత్వం ఆ సంఘటన ద్వారా ఎంతటి దుర్మార్గము, దౌర్జన్యం, అన్యాయము, అక్రమానికి పాల్పడిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వైసిపి నాయకుల బూతుల పురాణాన్ని భరిస్తూ, వింటూ కూడా దాదాపు 8 సంవత్సరాలనుండి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఓపికతో, సహనంతో, ఉన్నారు. మా నాయకుడు క్రమశిక్షణతో ఉన్నాడు కాబట్టి మా జనసైనికులు కూడా క్రమశిక్షణతో ఇప్పటివరకు ఉన్నాము, మంగళవారం మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళల సమక్షంలో ఒక్కసారిగా ఈ ఆంధ్ర రాష్ట్ర వైసీపీ గుండాలపైన ఉగ్ర నరసింహుని అవతారం చూడవలసి వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి అండగా సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు బిజెపి నాయకురాలు పురందేశ్వరికి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డికి, లోక్ సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణకి, రఘురామకృష్ణరాజుకి, బిజెపి నాయకులు సోమ వీర్రాజుకి, కిషన్ రెడ్డికి, మా జనసైనికులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మా జనసైనికులు అందరం స్వాగతిస్తాము, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజలందరి కోసమే, ప్రజలందరి అభివృద్ధి కోసమే, మనమందరం ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రస్తుతం సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు. నిన్నటి నుండి వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను వారికి చెప్పే సమాధానం ఒకటే, మీరు నిజంగా ఈ రాష్ట్రాన్ని మరియు ప్రజలను అభివృద్ధి చేస్తే మీకెందుకు భయం…? ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, వైసిపి పార్టీకి గ్రాఫు పూర్తిగా పడిపోయింది, ప్రజల మద్దతుని కోల్పోయింది, రాబోయే రోజుల్లో ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, జనసేన పార్టీకి ప్రజలు ఆదరాభిమానాలు పెరిగిపోతున్నాయి,. ముఖ్యంగా దళితులందరూ జనసేన పార్టీకి అండగా ఉన్నారు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క సామాన్య మానవుడు అభివృద్ధి చెందినట్లే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన పిల్లల కోసం దాచిపెట్టిన డబ్బులను కూడా తీసి పార్టీ కోసం వాడుతున్నారు, సొంత కుటుంబాన్ని కూడా కాదనుకుని ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ఆయన, పవన్ కళ్యాణ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, ఆయన ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తారు, కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య మానవుడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు.